జగన్ అక్రమ ఆస్తులపై ఈడితో విచారణ?: టిడిపి వినతికి ప్రధాని సానుకూలం

జగతి పబ్లికేషన్లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. జగన్ ప్రభావం రాష్ట్రంలో నామ మాత్రమే అన్నారు. పార్లమెంటులో లోక్సభ వాయిదా పడిన అనంతరం ప్రధానికి ఐదు పేజీల లేఖను ఎంపీలు అందించారు. జగన్ ఏఏ సంస్థలలో పెట్టుబడులు పెట్టారు, ఆయన సంస్థలలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే రెండు కోణాల్లో విచారణ జరిపించాలని కోరినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications