హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌ను నిలదీసిన డిఎస్, సోనియాను కలవాలని సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తాను అవసరమైన సందర్భంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై నా మనసులోని మాట చెబుతున్నానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛీప్ డి శ్రీనివాస్ మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బాగా కృషి చేస్తున్నారన్నారు. అయితే వారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ కోసం ఎంతగా కృషి చేస్తున్నారో రాజ్యాంగ బద్దంగా పొందిన పదవులకు కూడా అంతే న్యాయం చేయాల్సి ఉందన్నారు. అందుకే వారు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నారన్నారు. బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందడానికి వారు సభకు హాజరు కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

తెలంగాణపై తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని చెప్పారు. తాము ఇంత ఒత్తిడి కేంద్రంపై తీసుకు వస్తుంటే కేవలం సింగిల్ ఎజెండాతో పార్టీ పెట్టిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఅర్ మాత్రం ఏ మేరకు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అంటూ అధికార పక్షాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాల వద్దకు వెళ్లడం ఎంత వరకు సమంజసం అన్నారు.

కేంద్రం కూడా తెలంగాణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తమ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు.

English summary
PCC president D Srinivas said that he putting pressure on high command on Telagnana issue. He said congress MLAs going with responsible on Telangana as well as government. He questioned KCR on telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X