బొత్స సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన చిరంజీవి
కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తెలుగుదేశం తిరుగుబాటు శానససభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి కూడా ఓటేశారు. వారికి తెలుగుదేశం పార్టీ మరోసారి విప్ జారీ ప్రయత్నం చేసింది. కానీ వారు సంతకం చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వోటేశారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు వోటేయాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బిజెపి అధ్యక్షుడు, శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి మహమూద్ అలీకి వోటేయాలని ఆయన కిషన్ రెడ్డిని కోరారు. బిజెపికి ఇద్దరు శాసనసభ్యులున్నారు. ఉదయం పదిన్నర గంటల వరకు 35 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.