హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి అభ్యర్థికి కాంగ్రెస్ ఓటు: బాబు-కిరణ్ రహస్య అవగాహన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Chandrababu Naidu
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రహస్య ఒప్పందంతో ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలలో రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలలో వోటు హక్కును ఉపయోగించున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తమ నాలుగవ ప్రాధాన్యత ఓటును టిడిపి అభ్యర్థులకు వేసినట్లుగా తెలుస్తోంది. రహస్య ఒప్పందం మేరకే కాంగ్రెస్ తమ నాలుగవ ప్రాధాన్యత ఓటును టిడిపికి వేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం టిడిపికి, కాంగ్రెస్‌కు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి శత్రువులుగా ఉన్నారు. ఇటు టిఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు, జగన్‌‌ను తిప్పి కొట్టేందుకు వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తామని చెప్పారు. జగన్‌ను టార్గెట్ చేసిన కాంగ్రెసుకు ఎందుకు వేయాలనే ఉద్దేశ్యంలో వారు ఉండగా, తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకోవాలనే వ్యూహంలో టిఆర్ఎస్ వారున్నారు. వీరిని అడ్డుకునేందుకే కాంగ్రెసు తన ప్రాధాన్యత ఓటును టిడిపికి వేసినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, Congress and TDP is going with secret understand in mlc election. They targeted TRS and Ex MP YS Jaganmohan Reddy. Congress MLAs gave their forth vote to TDP candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X