హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆచూకీ లేని వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో టెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల ఆచూకీ లభించడం లేదు. వైయస్ జగన్‌తో వారు గురువారం ఉదయం సమావేశమయ్యారు. దాదాపు 25 మంది శాసనసభ్యులు జగన్‌తో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ స్థితిలో వారి సెల్‌ఫోన్లన్నీ స్విచాఫ్ చేసి ఉన్నాయి. దీంతో కాంగ్రెసు అభ్యర్థుల్లో టెన్షన్ ప్రారంభమైంది. వారు ఓటింగ్‌కు వస్తారా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మంత్రులు వారి కోసం అన్వేషణ ప్రారంభించారు.

జగన్‌తో ఉన్న 25 మంది శాసనసభ్యుల్లో 21 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారే. మిగతా నలుగురిలో ఇద్దరేసి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలకు చెందినవారు. వారు వోటింగ్‌కు వస్తారా, లేదా అనేది అ సందేహమైతే, వోటింగుకు వస్తే ఎవరికి వోటేస్తారనేది మరో సందేహం. తమ వోటును వారు చెల్లకుండా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థికి ఓటేస్తే కె. చంద్రశేఖర రావుతో జగన్ కుమ్మక్కయ్యారనే ప్రచారానికి బలం చేకూరుతుందనే అభిప్రాయం వారిలో ఉంది. దీంతో విప్‌ను ఉల్లంఘించకుండానే కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చేందుకు వారు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

English summary
MLC Election under MLA qouta created interesting, as YS Jagan MLAs strategy is not yet known. About 25 MLAs of Jagan camp switched off their cell phones and away from the scene.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X