మజ్లీస్ అభ్యర్థికి వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేల ఓటు?

కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీకి, మజ్లీస్కు ఒక్కటేసి టికెట్లు కేటాయించింది. విప్ను ధిక్కరించనట్లు కాకుండా, కాంగ్రెసును సమర్థించినట్లు కాకుండా జగన్ వర్గం ఎమ్మెల్యేలు మధ్యేమార్గాన్ని ఎంచుకుని కాంగ్రెసు బలపరిచిన మజ్లీస్ అభ్యర్థికి ఓటేసినట్లు ప్రచారం జరుగుతోంది. మహ్మద్ జానీ తనకు ఓటేయాలని అసమ్మతి శాసనసభ్యురాలు కుతూహలమ్మను వేడుకున్నారు. గురువారం ఉదయం తమ నాయకుడితో సమావేశమైన తర్వాత వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.
తాము కాంగ్రెసు పార్టీకి చెందిన అభ్యర్థికి తాము ఓటేయబోమని వారు ముందే ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. కనీసం 12 ఓట్ల క్రాస్ ఓటింగ్ జరిగితే మహ్మద్ జానీ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. కాగా, బిజెపి శాసనసభ్యులిద్దరు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మహ్మద్ అలీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications