చంద్రబాబు చాతుర్యానికి సిపిఐ, టిడిపి ఎమ్మెల్యేలు దెబ్బ

టిడిపి మిత్ర పక్షానికి మొత్తం 93 ఓట్లు ఉండగా, ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అయితే నాలుగో అభ్యర్థి గెలిచే అవకాశాలు లేకున్నప్పటికీ టిడిపి ప్రతిభా పాటిల్ను రంగంలోకి దించారు. అందులోనే చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించిన బాబు ప్రతిభను దింపారు. అయితే మొదట మొదటి ఇద్దరు అభ్యర్థులకు 25 చొప్పున, మూడో అభ్యర్థికి 24 చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించి 19 మందిని ప్రతిభకు కేటాయించారు. అయితే ఎన్నికలు ప్రారంభం అయ్యాక జగన్ వర్గం వ్యూహం తెలియడంతో బాబు ప్రతివ్యూహం చేశారు.
మొదటి ముగ్గురు అభ్యర్థులకు 24, ప్రతిభకు 21 మంది ఎమ్మెల్యేలను కేటాయించినప్పటికీ మరో వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఇద్దరు అభ్యర్థులకు 24 ఓట్లు, మూడో అభ్యర్థికి 23, ప్రతిభకు 22 ఓట్లు వేయించాలని అలా అయితే నలుగురిని గెలిపించుకోవచ్చునని బాబు వ్యూహరచన చేశారు. అయితే ఒక అభ్యర్థికి ఓటు తగ్గించుకవడానికి సిపిఐ నిరాకరించడంతో పాటు, టిడిపి ఎమ్మెల్యేలు అసలుకే మోసం వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేసి ససేమీరా అన్నారు. బాబు చేసేది లేక ఊరుకున్నారు. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు అందరూ చంద్రబాబు వ్యూహాన్ని అనుసరిస్తే నలుగురిని గెలిపించుకునే వాళ్లం కదాని ఆని బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications