వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ వైయస్ జగన్ ఓదార్పు యాత్ర, ఈసారి విజయనగరం జిల్లాలో

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయనగరం : వివిధ సమస్యలపై దీక్షలు చేపడుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మళ్లీ ఓదార్పు యాత్రకు పూనుకుంటున్నారు. ఈనెల 28 నుంచి విజయనగరం జిల్లాలో ఆయన ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన 17 కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారికంగా ప్రకటించిన తర్వాత జగన్ తొలిసారిగా ఓదార్పు యాత్రను చేస్తున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్‌ను వెల్లడించారు. ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాలు, 30 మండలాలు, 4 మున్సిపాల్టీల్లో పర్యటించనున్నారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకూ 580 కిలోమీటర్లలో ఓదార్పుయాత్ర జరగనుంది.

English summary
YSR Congress Party leader YS Jagan to takeup odarpu yatra again. His odarpu yatra will begin on March 28 and ends on April 2. YSR Congress party leader Bhumana Karunakar Reddy released YS Jagan's odarpu yatra schedule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X