తెరాస అంతర్గత విషయాలపై కె. కేశవరావు నో కామెంట్

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)సో చోటు చేసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, ముగ్గురు శాసనసభ్యుల సస్పెన్షన్ వంటి అంశాలపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవ రావు మాట్లాడడానికి నిరాకరించారు. తెరాస అంతర్గత విషయాలపై తాను మాట్లాడబోనని ఆయన అన్నారు. కాంగ్రెసుతో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో జరిగే ఎంపిల సమావేశంలో అన్ని విషయాలూ చెప్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణశాఖమంత్రి జైరాం రమేష్‌ చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నట్టు కేశవరావు అన్నారు. పోలవరం అవసరమే కానీ దానికి ప్రత్యామ్నాయమార్గాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొందరు కాంగ్రెస్‌ శాసనసభ్యులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన అంశంపై పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సెజ్‌ల పేరిట భూకేటాయింపులు ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజుల ఆంధ్రప్రదేశ్‌నే సెజ్‌ల కోసం అమ్మివేస్తారని ఆయనన్నారు. సెజ్‌లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+