ముగ్గురు తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్, కుదిపేసిన క్రాస్ ఓటింగ్

క్రాస్ వోటింగుకు పాల్పడినవారిని క్షమించాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భావించినా, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పార్టీ పోలిట్బ్యూరో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చివరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలుగా కొనసాగడానికి ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మరో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి పొలిట్బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. క్రాస్ఓటింగ్పై సమావేశంలో చర్చ జరుగుతుండడంతో ఆయన మధ్యలోనే బయటకొచ్చారు.
తాను పార్టీ ఆదేశాలను శిరసావహించి ఓటేశానని, తనపై నిందలు వేయొద్దని కోరారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నానని, తన చిత్తశుద్ధిని శంకించవద్దన్నారు. అయితే, తనపై ఆరోపణలు రావడంతో కలతచెందానని, అందుకే పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తమ అధినాయకుడు కేసీఆరేనని, ఆయనకే లేఖ ఇస్తున్నట్లు చెప్పారు. కాగా కేసీఆర్కు రాజీనామా లేఖను ఫ్యాక్స్లో పంపిన కావేటి సమ్మయ్య ఆదివారం స్వయంగా వచ్చి కేసీఆర్ను కలుస్తానని చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications