హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే రండి హైదరాబాద్ గడ్డపై తేల్చుకుందాం: ఈటెల ఛాలెంజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు దమ్మంటే హైదరాబాదు గడ్డపై తేల్చుకుందాం రావాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఛాలెంజ్ చేశారు. మా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీమాంధ్ర ఎంపీలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ప్రేలితే బావుండదన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇప్పటికే పార్టీ తుడిచి పెట్టుకు పోయిందన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేని స్థితిలో కాంగ్రెసు, టిడిపి ఉన్నాయన్నారు. పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోలేని వారు మాకు నీతులు చెప్పటం విచారకరమన్నారు. విజన్ 2020 అన్న చంద్రబాబు ప్రజల దృష్టిలో 420 అయ్యారన్నారు. మా పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేలే టిడిపి నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. టిడిపి ఆరోపణలు మానకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలే టిడిపిని బహిరంగంగా విమర్శిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ ను విమర్శించే అర్హత లేదన్నారు.

English summary
TRSLP Etela Rajender challenged today seemandhra tdp mlas. He warned them for comments on KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X