హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: తెలంగాణ టిడిపి ఫోరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ టిడిపి ఫోరం సోమవారం డిమాండ్ చేసింది. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోనెలా చర్యలు తీసుకోవారని వారు గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్‌కు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును విమర్శించడం అలవాటుగా మారిందన్నారు. మాట్లాడాలనుకుంటే తాము కెసిఅర్ కన్నా ఎక్కువే మాట్లాడగలమని అన్నారు.

కెసిఆర్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. చంద్రబాబును విమర్శించి కెసిఆర్, టిఆర్ఎస్ ప్రజల దృష్టిని మరల్చాలని అనుకుంటుందన్నారు. కాని అది సాధ్యం కాదని అన్నారు. కెసిఆర్ భాష వల్లే ఉద్యమానికి దెబ్బతగులుతోందన్నారు. ఆయన తన భాషను మార్చుకోవాలని సూచించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆయనకు తెలియకుండానే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు.

English summary
Telangana TDP Forum condemned today TRS comments on TDP president Chandrababu Naidu. They demanded KCR apology to TDP and Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X