ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికార పార్టీకి వ్యతిరేకంగా టిడిపి, జగన్ వర్గం ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
తిరుపతి: స్థానిక శాసనమండలి ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ వైఖరికి నిరసనగా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక పోలింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో తిరుపతి ఎన్నికలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికార కాంగ్రెసు పార్టీ ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకుంటున్నాయని జగన్ వర్గం నాయకులు ముందుగా ఆందోళనకు దిగారు. జనరల్ ఏజెంట్ పేరుతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.

అనంతరం టిడిపి నేతలు వచ్చి అధికార కాంగ్రెసు పార్టీ, జగన్ వర్గం నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కాగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. జమ్మలమడుగులో కాంగ్రెసు, జగన్ వర్గం కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో కూడా టిడిపికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. కాగా పెద్దిరెడ్డిని అరెస్టు చేసినందుకు నిరసనగా జగన్ వర్గం నాయకులు సదుంలో బంద్ నిర్వహించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది.

కాగా తిరుపతిలో వంద శాతం ఓటింగ్ జరిగింది. కడపలో ఇద్దరు సిపిఐ సభ్యులు ఎన్నికలను బహిష్కరించారు. కాగా జగన్ వర్గానికి చెందిన నేతలు కొందరు ఏలూరులో ఎమ్మెల్యేను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp leaders and tdp leaders organiged agitation at polling booth in tirupati. They accused Congress party attitude in election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X