ఐదవ పుట్టిన రోజుని జరుపుకుంటున్న ట్విట్టర్: హ్యాపీ ట్వీటింగ్
ఒకానోక సందర్బంలో ట్విట్టర్ సిఈవో డిక్ కోస్టోలో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి జనాభాకి అర్దం తెచ్చే విధంగా ట్విట్టర్ తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ రోజుకి దాదాపు 140 మిలియన్ ట్వీట్స్కు చేరుకుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా ట్విట్టర్ని ఓ ప్రసార మాద్యమంగా వాడుతున్నారు. ఏవైనా కొత్త న్యూస్ లేక ఇన్పర్మేషన్ పంచుకోవడం అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ట్విట్టర్ ఇప్పుడు ఓ ప్రెండ్షిప్ వెబ్సైట్ అయిపోయిందని అన్నారు.
2008వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో బరాక్ ఒబామా తన ఐడియాస్ని, సమాచారాన్ని మాస్ జనాభాకు చేరవేసే విధంగా ట్విట్టర్ని వాడిన సంగతి తెలిసిందే. ఇంకోక విషయం ఏమిటంటే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో ట్విట్టర్ ఇప్పటికీ ఓ ముఖ్యమైనటువంటి వార్తా ప్రసారంగా వాడుతున్నారంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మొన్నటికి మొన్న జపాన్లో సంభవించినటువంటి సునామీ, భూకంపం గురంచి బయట ప్రపంచానికి తెలియజేయడానికి అక్కుడన్నటువంటి మీడియాలు అన్ని సహాకరించని సమయంలో ట్విట్టర్ తనదైన పాత్రను పోషించింది. ఆ ఒక్కరోజులో జపాన్ సునామీ గురించి బయట ప్రపంచానికి 177 మిలియన్ ట్వీట్స్ పంపించడం జరిగింది.
దీనిని బట్టి మనకు తెలిసినది ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచంలో ట్విట్టర్ తనదైన శైలిలో న్యూస్ని, సమాచారాన్ని జనాభాకి అందవేస్తుంది. వన్ ఇండియా దట్స్ తెలుగు కూడా ట్విట్టర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రానున్న కాలంలో ట్విట్టర్ సమాచారాన్ని చేరవేయడంలో ఇంకా మేజర్ రోల్ పోషించాలని కోరుకుంటుంది.