అద్వానీ నన్ను క్షమించరు: ధ్వజమెత్తిన ప్రధాని మన్మోహన్ సింగ్

Manmohan Singh-LK Advani
న్యూఢిల్లీ: ప్రభుత్వ విశ్వాస పరీక్ష సందర్బంగా పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేశారని వికీలీక్స్ వెల్లడించిన అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మన్మోహన్ సింగ్ తిరస్కరిస్తూ బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీపై తీవ్ర్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి దక్కకుండా చేసినందుకు అద్వానీ తనను క్షమించబోరని ఆయన అన్నారు. తన ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం దాడి చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు.

ప్రధాని పదవి తన జన్మహక్కు అని అద్వానీ అనుకుంటున్నారని, అందువల్ల తనను అద్వానీ క్షమించబోరని ఆయన బుధవారం అన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, మరో మూడున్నరేళ్లు నిరీక్షించాలని ఆయన అన్నారు. వక్తగా తాను సుష్మా స్వరాజ్‌కి దీటు కాలేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విదేశీయులు ఏదో చెప్తే అది వాస్తవం కాదని తాము తేల్చలేమని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన అంశాల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటరీ విచారణ సంఘం కూడా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిందని ఆయన చెప్పారు. తాము అక్రమాలకు పాల్పడలేదని, డబ్బులు ఇవ్వాలని తాము ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+