వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ నన్ను క్షమించరు: ధ్వజమెత్తిన ప్రధాని మన్మోహన్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh-LK Advani
న్యూఢిల్లీ: ప్రభుత్వ విశ్వాస పరీక్ష సందర్బంగా పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేశారని వికీలీక్స్ వెల్లడించిన అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మన్మోహన్ సింగ్ తిరస్కరిస్తూ బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీపై తీవ్ర్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి దక్కకుండా చేసినందుకు అద్వానీ తనను క్షమించబోరని ఆయన అన్నారు. తన ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం దాడి చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు.

ప్రధాని పదవి తన జన్మహక్కు అని అద్వానీ అనుకుంటున్నారని, అందువల్ల తనను అద్వానీ క్షమించబోరని ఆయన బుధవారం అన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, మరో మూడున్నరేళ్లు నిరీక్షించాలని ఆయన అన్నారు. వక్తగా తాను సుష్మా స్వరాజ్‌కి దీటు కాలేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విదేశీయులు ఏదో చెప్తే అది వాస్తవం కాదని తాము తేల్చలేమని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన అంశాల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటరీ విచారణ సంఘం కూడా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిందని ఆయన చెప్పారు. తాము అక్రమాలకు పాల్పడలేదని, డబ్బులు ఇవ్వాలని తాము ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు.

English summary
Responding in equal measure to the scathing attack by the Opposition over the WikiLeaks exposé on the 2008 trust vote, Prime Minister Manmohan Singh, Wednesday, took potshots at the BJP by saying that LK Advani has never forgiven him for not being able to occupy the PM’s chair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X