ఒట్లున్న భార్యలను వదిలేసి భర్తలతో క్యాంప్ పెడితే ఎలా: సిఎం
అయితే పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల ఇతరులు లబ్ధి పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని ఓడించాడనే ఆరోపణలపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఆరు సీట్లు గెలుస్తామని అనుకుంటే మూడు సీట్లు మాత్రమే గెలుపొందామని చెప్పారు. అయితే కొన్ని సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం బాధగా అనిపించిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు.
ఈ ఎన్నికల ద్వారా కడప జిల్లాలో మేము ఎంత బలంగా ఉన్నామో తెలుస్తోందన్నారు. ఫలితాలు వచ్చే ఎన్నికలకు రిఫరెండం కాదన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉందన్నారు. అప్పటి వరకు ఏమైనా జరగవచ్చన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డ అభ్యర్థులకు టిక్కెట్ ఉండదన్నారు. చిత్తూరు జిల్లాలో ఓటమి వ్యక్తిగతంగా నష్టమే అన్నారు. అయితే దానికి ఎవరినీ బాధ్యులను చేయడం లేదన్నారు. ఎన్నికలలో ఓపెన్ బ్యాలెట్ ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.