జెసి దివాకర్ రెడ్డి షాక్: అనంతపురంలో టిడిపి అభ్యర్థి గెలుపు

తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి వర్గం అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరిపినా జెసి దివాకర్ రెడ్డి వినలేదు. మెట్టు గోవింద రెడ్డికి ఆయన మద్దతు తెలిపారు. 8 జిల్లాల్లోని 9 ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications