సత్తా చాటిన వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ

సొంత జిల్లా చిత్తూరులో కిరణ్ కుమార్ రెడ్డికి వైయస్ జగన్ వర్గం షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినా జగన్ వర్గం అభ్యర్థి తిప్పారెడ్డిని కాంగ్రెసు ఓడించలేకపోయింది. ఒక్క ఓటు తేడాతో జగన్ వర్గానికి చెందిన తిప్పా రెడ్డి గెలిచినట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెసు అభ్యర్థి కోరిక మేరకు రీకౌంటింగ్ జరుగుతోంది. దీంతో ఫలితం తారుమారవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, కడప జిల్లాలో జగన్ వర్గాన్ని కాంగ్రెసు పార్టీ నిలువరించలేకపోయారు. ముగ్గురు మంత్రులు మోహరించినా జగన్ వర్గాన్ని దెబ్బ తీయలేకపోయారు.
జగన్ వర్గం, కాంగ్రెసు మధ్య విభేదాలతో తెలుగుదేశం పార్టీ లాభపడినట్లు కనిపిస్తోంది. గతంలో ఈ 9 స్థానాల్లో ఎనిమిది స్థానాలు కాంగ్రెసు చేతిలో ఉండేవి. అయితే, మూడు సీట్లను మాత్రమే కాంగ్రెసు నిలబెట్టుకోగలిగింది. మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. అనంతపురంలో కాంగ్రెసులోని విభేదాల వల్లనే తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. నెల్లూరులో కాంగ్రెసు అభ్యర్థి వాకాటి పాండురంగా రెడ్డి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications