హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెసి దివాకర్ రెడ్డి, రఘువీరా ఫైట్: మల్లుభట్టి విక్రమార్క ఆంక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: మంత్రి రఘువీరా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క అప్రమత్తయ్యారు. ఆయన ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఆయన ముందుకు వచ్చారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి ఓటమిపై రఘువీరా రెడ్డి, దివాకర్ రెడ్డి పరస్పరం విమర్సలకు పూనుకున్నారు. ఇటీవల జెసిపై రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయగా, శనివారం జెసి దివాకర్ రెడ్డి రఘువీరా రెడ్డిపై విరుచుకుపడ్డారు.

ఇకపై అనుమతి లేకుండా ఎవరూ సీఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించరాదని చీఫ్‌విప్‌ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రఘువీరా, జేసీలు అక్కడే మీడియా సమావేశాలు పెట్టి పరస్పరం విమర్శించుకున్న నేపథ్యంలో ఆయన ఈ ఆంక్షలు విధించారు. సీఎల్పీ వేదికగా సొంత పార్టీ నేతలను విమర్శించటం తగదని ఆయన అన్నారు. తన అనుమతిలేకుండా మీడియా సమావేశాలు పెట్టనివ్వద్దని ఆయన సిబ్బందిని ఆదేశించారు. మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి మీడియా సమావేశాలు ఎలా పెట్టించారని సిబ్బందిపై ఆయన మండిపడ్డారు.

English summary
Government chief whip Mallubhatti Vikramarka ordered for restriction to address in CLP office. He said that every one should take permission to organise media conferences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X