వ్యక్తుల వెంట పార్టీ నడవదు: జగన్‌కు కిరణ్ చురక

Kiran Kumar Reddy
హైదరాబాద్: వ్యక్తుల వెంట పార్టీ నడవదని, పార్టీ వెంటనే వ్యక్తులు నడవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను పార్టీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

పార్టీలో కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. కార్యకర్తలను ప్రోత్సహించాలన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అని అన్నారు. కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ దెబ్బతింటుందన్నారు. కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ ఉండదన్నారు.డిఎస్‌ పార్టీలో మరింత ఎదగాలని ఆయన అన్నారు. డిఎస్‌కు ఇంతకంటే పెద్ద పదవి రావాలని అన్నారు. పార్టీ వెంటే కార్యకర్తలు ఉంటారన్నారు. కార్యకర్తలు, నేతలు కష్టపడితే విజయం ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు ప్రతి మనిషికి సహజమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమే అని అన్నారు. పార్టీకి డిఎస్ చేసిన సేవలు మరువలేనివన్నారు. డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా అద్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డిఎస్ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారని అన్నారు. డిఎస్ మరింత ఎదగాలని ఆయన కోరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+