వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్‌ను ప్రశ్నించిన ముంబై పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mandira Bedi
ముంబై: బంద్రా - వొర్లి సీలింక్‌కు చెందిన మూడు కేబుల్స్ ధ్వంసమయ్యాయని సాగిన ప్రచారం కేసులో సైబర్ విభాగానికి చెందిన ముంబై పోలీసులు సినీ నటి, స్పోర్ట్స్ యాంకర్ మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్‌ను శనివారం ప్రశ్నించారు. బంద్రా - వొర్లి సీలింక్ కేబుల్స్ తెగిపోయాయని కొద్ది రోజుల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అతి వేగంగా నగరమంతా పాకింది. సీలింక్ మీదుగా వెళ్లే వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.

కౌశల్‌ను సైబర్ సెల్ కార్యాలయానికి రప్పించి అతని ట్విట్టర్‌లో రాసిన విషయాల గురించి ప్రశ్నించారు. సీలింక్ కేబుల్స్ తెగిపోయాయనే ప్రచారం ఊపందుకుని సీలింక్ మీదుగా వెళ్లవద్దని హెచ్చరిస్తూ గత బుధవారం నగరంలో ఎస్‌ఎంఎస్‌లు జోరుగా ఒకరి నుంచి మరొకరికి వెళ్లాయి. అరగంటలో ఆ విషయం మీడియా కనిపెట్టింది. 4.7 కిలోమీటర్ల వంతెనను నిర్మించిన హిందూస్తాన్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ సైబర్ క్రైమ్ దర్యాప్తు విభాగంలో ఫిర్యాదు చేసింది.

English summary
The cyber cell of the Mumbai police on Saturday questioned Raj Kaushal, husband of actor and sports anchor Mandira Bedi, for spreading rumours about the collapse of three cables of the Bandra-Worli sealink a few days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X