సెజ్‌లకు వక్ఫ్ భూములు కేటాయిస్తారా?: అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజం

Akbaruddin Owaisi
హైదరాబాద్‌: వక్ఫ్‌ భూములను సెజ్‌లకు ఎలా కేటాయిస్తారని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. భూ కేటాయింపులపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏపీఐసీసీ 800 ఎకరాల వక్ఫ్‌ భూములను విక్రయించిందన్నారు. ఘటకేసర్‌, గోపన్నపల్లిలోని ఇన్ఫోసిస్‌ భూములు, సత్యం కంప్యూటర్స్‌, రహేజా, ల్యాంకో హిల్స్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, సరూర్‌నగర్‌లోని బ్రహ్మీ ఇన్ఫోటెక్‌, తూంకుంట అపారెల్‌ పార్క్‌ తదితర భూములన్నీ వక్ఫ్‌ బోర్డుకు చెందినవేనని సర్వే నంబర్లతో సహా ఆయన వెల్లడించారు.

అనంతపురం జిల్లాలో వక్ఫ్‌ భూమికి చెందిన 3300 ఎకరాలు, హిందుపూర్‌లో 3500 ఎకరాల వక్ఫ్‌భూమిని సెజ్‌ల కోసం కేటాయించారని ఆయన సభకు తెలిపారు. ప్రభుత్వభూమిని ఇష్టానుసారంగా పంచారని, అవి ఏ లక్ష్యంతో కేటాయించారో వాటి అడ్రస్‌ కూడా లేదని, వక్ఫ్‌భూములను ఎవరికిబడితే వారికి ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 50 వేల ఎకరాలకు పైగా సంస్థలకు కేటాయించిందని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం వక్ఫ్ భూమిని కేటాయించారని, అక్కడి మసీదును తిరిగి కట్టిస్తామని దివంగత ముఖ్యమంత్రి వైయస్ హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు కాలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+