హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం చేశాం, ఏం చేయాలి: ముప్పయ్యేళ్ల టిడిపిపై చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: 30 ఏళ్లుగా ప్రజలకు ఏం చేశాం, ఇంకా ఏం చేయాలనే దానిపై పూర్తిగా సమీక్షిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. టిడిపి ఏర్పడి ముప్పయ్యేళ్లు అయిన సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు అన్నారు. ప్రజలకు పునరంకితం అయ్యేందుకు ఎలా ముందుకు వెళ్లాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాడు కేంద్ర స్థాయి పార్టీని ప్రతిపక్ష స్థాయిలో కూర్చుండబెట్టిన అరుదైన గౌరవం టిడిపిదే అన్నారు.

టిడిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు. వచ్చే మహానాడు వరకు పార్టీ విధివిధానాలు నిర్ణయించి ప్రజలలోకి తీసుకు వెళ్లే కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలుగువారి గురించి ప్రపంచానికి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపి జెండా బడుగు బలహీన వర్గాలకు అండ అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. నేటి నుండి వచ్చే సంవత్సరం మహానాడు వరకు 14 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లేందుకు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో పార్టీ పెట్టారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి కార్యకర్తలు, నేతలు కలిసి పని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
TDP president Chandrababu Naidu said today that they will monitor about 30 years of Party. He said they will work with public upto Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X