టిడిపిది అభివృద్ధి మాది కాదా, చిత్తశుద్ధిని శంకించవద్దు: గీతా రెడ్డి

కాగా ఐటి అభివృద్ధిలో, సెజ్ల గురించి చంద్రబాబు ప్రయత్నాలకు ఆమె కితాబు ఇచ్చారు. వారు చేసింది అభివృద్ధని, మేం చేసింది అభివృద్ధి కాదన్నట్టు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్నారు. ఎమ్మార్ విషయంలో గత ప్రభుత్వం కంటే కాంగ్రెసు ప్రభుత్వం మెరుగుగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రం ప్రయోజనాలకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైన చిత్తశుద్ధితో ఉందన్నారు. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం ఉందన్నారు. సెజ్లకు కేటాయించిన భూములపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications