పులివెందుల, కడప ఉప ఎన్నికలపై చంద్రబాబు కసరత్తు

Chandrababu Naidu
హైదరాబాద్: పులివెందుల శాసనసభ స్థానానికి, కడప పార్లమెంటు సీటుకు జరిగే ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఈ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కసరత్తు మొదలు పెట్టారు. గురువారంనాడు ఆయన కడప జిల్లా పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ రెండు సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైయస్ విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. మారిన పరిస్థితి నేపథ్యంలో రెండు సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను పోటీకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఆయన గురువారంనాటి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు వైయస్ జగన్ అవినీతిని ప్రచారాస్త్రం చేసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+