విభేదాలను పరిష్కరించుకుంటాం: దేవినేని ఉమా మహేశ్వర రావు

Devineni Umamaheswara Rao
విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆ పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అంతర్గత అంశాలు రచ్చ రచ్చ కావటం దురదృష్టకరమని ఆయన అన్నారు. విజయవాడలో సహకార సంఘం సిబ్బంది చేస్తున్న దీక్షలకు మద్దతు ప్రకటించిన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలను శిరసావహించి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటామని ఆయన అన్నారు.

దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ తాను పార్టీ విజయవాడ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని వల్లభనేని వంశీ ప్రకటించి సంచలనం సృష్టించారు. దాంతో ఉమా మహేశ్వర రావు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు శాసనసభ్యుడు కొడాలి నాని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు రచ్చకెక్కాయి. దీనిపై సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+