కడపకు చేరుకున్న వైయస్ జగన్, ఉప ఎన్నికల పోరుపై కసరత్తు

మితిమీరిన విశ్వాసం కూడా పని రాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అవతలి వైపు తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఉండడంతో ఎన్నికలపై తీవ్రంగానే కసరత్తు చేయాల్సి ఉంటుందని ఆయన అనుకుంటున్నారు. కాంగ్రెసు, తమ మధ్య పోరులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందకుండా చూడాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభా సెగ్మెంట్ల ఇంచార్జీలను అన్వేషించడంలో ఆయన మునిగిపోయారు. తన వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు ఆయనను కలిశారు. కడప పార్లమెంటు సీటు నుంచి జగన్, పులివెందుల శాసనసభా స్థానం నుంచి వైయస్ విజయమ్మ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications