సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యాఖ్యలపై కె కేశవరావు ధ్వజం
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణపై రహస్య నివేదిక ఇవ్వడం నీచాది నీచం అని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీని తాము గుర్తించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రహస్య నివేదిక ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నేతలను ప్రలోభ పెట్టమని ఓ కమిటీ చెప్పడం దురదృష్టకరమన్నారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు హైదరాబాదులో సమావేశం అయి తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. అనంతరం కెకె విలేకరులతో మాట్లాడారు.
జూపల్లి కృష్ణారావు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కెకె కోరారు. మే నెల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అప్పుడు తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెల తర్వాత తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
Comments
k keshava rao telangana kirankumar reddy congress hyderabad కె కేశవరావు తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు జూపల్లి కృష్ణారావు హైదరాబాద్
English summary
Congress Party senior leader K Keshava Rao oppossed CM Kirankumar Reddy comments on Telangana. He also blamed Srikrishna Committee 8th chapter.
Story first published: Sunday, April 3, 2011, 15:46 [IST]