మరణించాక ఎంతోమందిని ప్రజలు మర్చిపోతారు: చంద్రబాబునాయుడు
ఎస్సీ విద్యార్థులందరికీ సరియైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ ఫైనాన్సు కార్పోరేషన్లో డబ్బులు లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీలను, ఎస్టీలను విస్మరిస్తోందన్నారు. వారి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. ఇప్పటికీ దళితులు అంటరానివారిగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ఏర్పాటు చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కమిటీ కోసం చైర్మన్ను కూడా నియమించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
ఎస్సీల అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా దళితులకు అందలం ఎక్కించిన ఘనత టిడిపిది అన్నారు. చీఫ్ సెక్రటరిగా మాధవరావు, శాసనసభ స్పీకరుగా ప్రతిభా పాటిల్, పార్లమెంటు స్పీకరుగా బాలయోగి వంటి దళితులను చేయడంలో టిడిపి ముందు ఉందన్నారు. దళితులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.