హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు అవమానం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువ: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణను వ్యతిరేకిస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవమానం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తే అవమానం తక్కువ, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన విమర్సించారు.

పంచాంగ కర్తలతో కూడా చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఉగాదిని కూడా సమైక్యాంధ్రలోనే చేసుకుంటామని పంచాంగ కర్త గార్గేయ చెప్పడంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యనించారు. చంద్రబాబు మనస్సులోని మాటను గ్రహించి గార్గేయ ఆ విధంగా చెప్పారని ఆయన అన్నారు. 2009లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని గార్గేయ గతంలో చెప్పారని, అది పగటి కలగానే మిగిలిపోయిందని, సమైక్యాంధ్ర కూడా పగటి కలగానే మిగులుతుందని ఆయన అన్నారు. చంద్రబాబును సంతోషపెట్టడానికే గార్గేయ ఆ విధంగా చెప్పారని ఆయన అన్నారు.

English summary
TRS MLA Harish Rao lashed out at TDP president N Chandrababau Naidu for his anti Telangana stand. He opposed Gargeya's estimation on united Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X