వైయస్ జగన్ను తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తున్నాం: కోదండరామ్

ఈనెల 20వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు కోదండరాం తెలిపారు. ఈ దఫా ఉద్యమం కేంద్రంపైన, రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఉంటుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా తాము వెనక్కి తగ్గలేదని, ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం తమ వ్యూహమన్నారు. ఈనెల 11వ తేదీనుంచి తెలంగాణ పది జిల్లాల్లో శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ అధ్యాయంపై ప్రచార ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications