వైయస్ జగన్‌పై పోటీకి డిఎల్ రవీంద్రా రెడ్డిపై పెరుగుతున్న ఒత్తిడి

DL Ravindra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై కడప లోకసభ స్థానంలో పోటీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. వరదరాజులు రెడ్డిని పోటీకి పెట్టాలని తొలుత అనుకున్నప్పటికీ డిఎల్ రవీంద్రా రెడ్డిని పోటీకి దింపితేనే జగన్‌ను దీటుగా ఎదుర్కోగలమని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కడప జిల్లా కాంగ్రెసు నాయకులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు.

వరద రాజులు రెడ్డితో పాటు జగన్‌పై పోటీ పెట్టేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నారు. కందుల రాజమోహన్ రెడ్డి పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది. కందుల రాజమోహన్ రెడ్డి తన సోదరుడు కందుల శివానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. కందుల రాజమోహన్ రెడ్డి జగన్‌పై గట్టి అభ్యర్థే అవుతారని భావిస్తున్నారు. గతంలో కడప లోకసభ స్థానంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రీత్యా జగన్‌ను కందుల రాజమోహన్ రెడ్డి దీటుగా ఎదుర్కోగలరని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+