వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంలో జగన్‌కు మళ్లీ చుక్కెదురు: కామన్ సింబల్‌పై ఈసీదే నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో బుధవారం మళ్లీ చుక్కెదురయింది. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్‌ను కేటాయించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ జగన్‌ పార్టీకి చెందిన కొందరు సుప్రీంకోర్టును రెండోసారి ఆశ్రయించారు. అయితే దీనిని పరిశీలించిన సుప్రీం కామన్ సింబల్ కేటాయించాల్సిందిగా తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించమని తేల్చి చెప్పింది.

పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని సూచించగలమని చెప్పింది. అయితే పార్టీకి కామన్ సింబల్ కేటాయించడంలో తుది నిర్ణయం మాత్రం ఈసీదేనని చెప్పింది. రెండోసారి కూడా తమకు కోర్టులో చుక్కెదురు కావడంతో జగన్ వర్గం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇది వరకు కూడా కామన్ సింబల్ కోసం జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అప్పుడు కూడా కోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే జగన్ మాత్రం రెండోసారి కోర్టుకు వెళ్లారు. రెండోసారి కూడా ఎదురు గాలి వీచింది.

త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లి కామన్ సింబల్‌ను తెచ్చుకొని అదే సింబల్‌పై ఎన్నికల బరిలోకి దిగాలని యోచించారు. ఉప ఎన్నికలలో తన తల్లి విజయమ్మ, తాను ఒకే గుర్తుపై పోటీ చేస్తే కలిసి వస్తుందని జగన్ భావించారు. కానీ సుప్రీంలో చుక్కెదురు కావడంతో ఇప్పుడు ఎన్నికలకు ఈసీ ఇచ్చే గుర్తులపై వెళ్లే అవకాశం ఉంది. అయితే సుప్రీం సూచనల మేరకు ఈసీ పరిశీలించే అవకాశం కూడా లేక పోలేదు.

English summary
Ex MP YS Jaganmohan Reddy shocked by Supreme Court justice today on common symbol. SC said common symbol is EC decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X