తల్లిదండ్రులకు ఇంటిలోనే చితి పేర్చిన తనయుడు, హైదరాబాద్లో దారుణం
బుధవారం సాయంత్రం తండ్రి హన్మంతరావు, తల్లి సరోజిని మృతదేహాలపై ఇంటి ఆవరణలోనే కట్టెలు పేర్చి నిప్పుపెట్టేందుకు నర్సింహరాజు యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి నర్సింహరాజును అదుపులో తీసుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. సరోజిని మృతదేహం కుళ్లిపోయింది. ఆమె మూడు రోజుల క్రితమే మృతిచెంది ఉంటుందని, హన్మంతరావు 48 గంటల క్రితం ఉరివేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. భార్య అనారోగ్యంతో చనిపోవడంతో మనస్తాపంతో అతను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని నర్సింహరాజు పోలీసులతో చెప్పాడు. భార్య వదిలి వెళ్లినప్పటి నుంచి నివాసం నుంచి బయటకురాని నర్సింహరాజు ఇంట్లోనే తల్లిదండ్రుల అంత్యక్రియలు చేద్దామని భావించి ఉంటాడని రాజేంద్రనగర్ ఏసీపీ సర్వేశ్వర్రెడ్డి తెలిపారు.
Comments
English summary
A son tried to cremate his parents dead bodies in his house in Hyderabad. Dead bodies of retired judge Hanumanth Rao and his wife found in suspicious circumstances.
Story first published: Thursday, April 7, 2011, 8:20 [IST]