వైయస్ జగన్ ఇష్యూ: శంకర రావు ప్రకటనపై దానం నాగేందర్ ఆగ్రహం

కాంగ్రెసు విద్యార్థి అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న దానం నాగేందర్ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ వ్యవహారాల్లోకి సోనియా గాంధీని లాగడం సరి కాదని ఆయన అన్నారు. ఉన్నతమైన పదవిలో బాధ్యతారహితంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. చిన్న విషయాల్లోకి సోనియా గాంధీని లాగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
కడప, పులివెందులలో జరగబోయే ఉప ఎన్నికలు సోనియా, వైఎస్ఆర్లకు మధ్య పోటీ కాదని 20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఇది బెంగుళూరు, పులివెందుల మధ్యే పోటీ అన్నారు. జగన్ ఎప్పుడూ బెంగుళూరులోనే ఉంటారు, వివేకా పులివెందుల్లోనే ఉంటారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications