కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ ఉప ఎన్నికలతో కాంగ్రెసు పతనం ప్రారంభమైంది: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప లోకసభ, పులివెందుల శాసనభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలతో కాంగ్రెసు పతనం ప్రారంభమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ అన్నారు. కడప లోకసభ స్థానంలో తాను చేస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ మాటలన్నారు. కాంగ్రెసు పార్టీపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ ఉప ఎన్నికలు ముమ్మాటికీ వంద శాతం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాకు, వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య జరుగుతున్నవేనని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుట్రను ప్రజలు తిప్పికొడతారని ఆయన అన్నారు.

కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు మంగళవారం ఎన్నికల కమిషన్ అధికారి దక్షిణామూర్తిని కలుసుకున్నారు. వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు కడప లోకసభ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైయస్సార్ కాంగ్రెసు తరఫున నామినేషన్ వేసిన మహబూబ్ బాషాపై కూడా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కడప లోకసభ నియోజకవర్గంలో పోలీసులకు పట్టుబడిన 82 లక్షల రూపాయలు కాంగ్రెసు పార్టీకి చెందినవేనని వారు ఫిర్యాదు చేశారు.

English summary
YSR Congress party leader and Kadapa candidate YS Jagan lashed out at Congress. He said that Congress devastation will begin with Kadapa bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X