జగన్‌కు పోటీ ఇస్తామా, కిరణ్‌ను ఆరా తీసిన కాంగ్రెసు అధిష్టానం

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతామా, లేదా అని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆరా తీసింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహంపైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రెండు స్థానాల్లో పోటీ వైయస్సార్ కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీకి మధ్య మాత్రమే ఉంటే, తర్వాత తమ పార్టీకి ఇబ్బంది ఎదురవుతుందని అహ్మద్ పటేల్ అన్నట్లు సమాచారం.

వైయస్ జగన్‌ను సాధ్యమైనంత వరకు ఎదుర్కునే ప్రయత్నం చేయాలని, ఓడించలేకపోయినా మెజారిటీ సాధ్యమైనంత మేర తగ్గించేలా వ్యవహరించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు చెబుతున్నారు. గట్టిగా పట్టు పడితే పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వైయస్ వివేకానంద రెడ్డి మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే కడప లోకసభ స్థానంలో పోటీ చేస్తున్న డిఎల్ రవీంద్రా రెడ్డి చేత కూడా రాజీనామా చేయించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే తిరిగి రవీంద్రా రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని అహ్మద్ పటేల్ చెప్పినట్లు సమాచారం.

కాగా, పులివెందులలో ఓడిపోతే వైయస్ వివేకానంద రెడ్డిని రాజ్యసభకు ఎన్నికునే అంశం కూడా చర్చకు వచ్చింది. వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా తీసుకుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడమా, రాజ్యసభకు ఎన్నిక చేసుకోవడమా అనే విషయంపై మరింతగా ఆలోచించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+