కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తన అవినీతి డబ్బును ప్రజలకు పంచాలి: మైసూరా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mysoora Reddy
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సొమ్మును ప్రజలకు పంచాలని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి ఎం.వి.మైసూరారెడ్డి గురువారం డిమాండ్ చేశారు. తన అవినీతి సొమ్మను కాపాడుకోవడానికి జగన్ పార్టీని పెట్టాడన్నారు. అవినీతి సొమ్ము రక్షణలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఉద్బవించిందని ఆరోపించారు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల మధ్య వస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వాస్తవం కాదన్నారు. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఎన్నికలలో పోటీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అయితే ఆది ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని చెప్పారు. ఈ నెల 21 నుండి చంద్రబాబు కడపలో ప్రచారం చేస్తారని చెప్పారు. కాగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికే జగన్ ఉప ఎన్నికలు తెచ్చాడని మరో ఎంపి రమేష్ రాథోడ్ ఆరోపించారు.

English summary
TDP senior leader Mysoora Reddy demanded Ex MP YS Jaganmohan Reddy today that to distribute his property to public. He condemned Congress and TDP match fixing comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X