వైయస్ జగన్ ఆస్తులే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల అస్త్రాలు
అఫిడవిట్ ద్వారా జగన్ తన నల్లధనాన్ని లెక్కల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్లు, స్థలాల వంటి స్థిరాస్థుల్ని మార్కెట్ విలువ ప్రకారం చూపించకుండా ఎన్నికల సంఘాన్ని, ప్రజల్నీ మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్లోని వైయస్ జగన్ ఇంటి విలువ 18 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే భారతి సిమెంట్స్ విలువ 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని, జగన్ తన ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘానికి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అఫిడవిట్లోని ఆస్తుల వివరాలపై ప్రజల్లో అనేక అనుమానాలున్నందున తక్షణం వాటిపై వివరణ ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. అతితక్కువ కాలంలో వేల కోట్ల రూపాయలను ఎలా దోచుకోవచ్చన్న విషయం జగన్ అక్రమార్జనతో నిరూపితమైందని ఆయన విమర్శించారు. కడప ఉప ఎన్నికలు కుబేర, కుచేలుల మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ప్రజల సొమ్ము దోచుకున్న జగన్కు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బెంగళూర్లోని రాజభవనం, తదితర ఆస్తులు తనవి కావని జగన్ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.