గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగర్‌ కాలువలో పడిన ట్రాక్టర్: పది మంది మహిళలు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి వద్ద ఓ ట్రాక్టర్ సాగర్‌ కాలువలో పడటం వలన 10 మంది మహిళలు మృతి చెందారు. పలువురికి గాయాలవడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరికొందరు సాగర్‌లో గల్లంతయ్యారు. వారి కోసం వెతుకుతున్నారు. ట్రాక్టర్‌లో వెళ్లే వారంతా మహిళలే కావడం వలన మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ట్రాక్టర్ పడిన చోట కాలువ లోతు సుమారు 15 అడుగుల వరకు ఉంటుంది. మగవారు అయితే ఈత కొట్టుకుంటూ వచ్చేవారు. కానీ ట్రాక్టర్‌లో ఉన్నవారంతా మహిళలే కావడంతో పదిమంది మృతి చెందారు.

కాగా ట్రాక్టర్ డ్రైవర్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ట్రాక్టరు సాగర్‌ కాలువలో పడటం వలన భయంతో పారిపోయాడా లేక సాగర్‌లోనే గల్లంతయ్యాడా అనే విషయం తెలియరాలేదు. మృతి చెందిన వారంతా వడ్లపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

English summary
Ten woman dead in Guntur district today with accident. Many people injured and sent to hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X