బాబా సమాధి కోసం పుణ్యక్షేత్రాల నుంచి జలాలు, మట్టి..!!

ఈ కుల్వంత్ హాలులోనే బాబా సాధారణంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రస్తుతం బాబాను ఇదే హాలులో సమాధి చేయనున్నారు. సమాధి ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనాయి. బాబా సమాధి కోసం దేశ వ్యాప్తంగా పవిత్ర స్థలాలుగా భావించే 18 ప్రాంతాల నుండి మట్టిని అక్కడి భక్త సమాజాలు ఇప్పటికే పుట్టపర్తికి చేర్చాయి. గంగ, యమునతో పాటు 7 నదులు, తీర్థాల నుండి కూడా జలాన్ని పుట్టపర్తికి తీసుకువచ్చారు. సమాధి ప్రక్రియలో వీటిని వాడనున్నారు.
పరమ పవిత్ర స్థలమైన కాశీ నుండి అలాగే కర్నాటక రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖ వేద పండితులు, వివిధ మఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయిబాబాకు అత్యంత ప్రీతి పాత్రమైన ఏనుగు సత్య కీర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, బిజెపి పార్టీ సభ్యులు బండారు దత్తాత్రేయ, బిజెపి మాజీ అధ్యక్షుడు ఎల్.కే. అద్వానీలతో పాటు పలువురు ప్రముఖులు బాబాకు నివాళులు అర్పించారు. కాగా.. సత్య సాయి బాబాను సమాది చేసిన తర్వత మాత్రమే భక్తులను కుల్వంత్ హాలులోనికి అనుమతించనున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications