వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు ఉదయం 9.30 గంటలకు సత్య సాయి బాబా సమాధి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: సత్యసాయి బాబా అంత్యక్రియలు బుధవారం ఉదయం 9 :30 నుండి 10 గంటల మధ్య జరగనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. బాబా మహా సమాధి అనంతరం మధ్యహ్నం 12 గంటల తర్వాత సమాధి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సత్య సాయిబాబాను కల్వంత్ హాల్లోనే సమాధి చేస్తారు.

మంగళవారం సాయంత్రం నుండి రేపు మధ్యాహ్నం వరకు భక్తులెవరూ పుట్టపర్తికి రావద్దని కలెక్టర్ సూచించారు. సాయంత్రం 6 గంటలోపు క్యూలైన్‌లో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, సత్య సాయిబాబాను దర్శించడానికి మంగళవారం రాత్రి 8 గంటలకు వరకు అనుమతి ఇస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వస్తున్నందున భక్తులను అనుతించబోరు.

English summary
Sathya Sai Baba's last ritual will take place tomorrow between 9.30 AM and 10 AM. Devotees will be permitted to Samadhi after 12 Noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X