గుంటూరులో హైదరాబాద్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య?

కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్లో శవంగా కనిపించింది. అయితే పోలీసులు మొదట గుర్తు తెలియని శవంగా చూసినప్పటికీ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ఆ బాడీని భవానిదిగా గుర్తు పట్టారు. భవాని బాడీకి పోస్టు మార్టం చేశారు. కృష్ణా నదిలో భవాని ప్రమాదవశాత్తు మరణించిందా లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా తెలియలేదు. అయితే భవానిని తీసుకు వెళ్లిన స్నేహితులు (శ్రీకాంత్, పప్పుగా తెలుస్తోంది) పోలీసులకు అస్పష్టమైన సమాధానాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలు జారి నదిలో పడిపోయిందని చెబుతున్నారు. అయితే కాలుజారి భవాని నదిలో పడిపోతే వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాల్సి ఉండగా ఎందుకు చెప్పలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications