హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో భార్యను, పిల్లలను చంపి పరారైన కుటుంబ యజమాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులో దారుణం జరిగింది. కుటుంబ పెద్దనే తన భార్యను, ఇద్దరు పిల్లలను చంపి పరారైన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో గల వైదేహినగర్‌లో చోటు చేసుకుంది. భార్య శ్రావణి, పిల్లలు శశాంక్(5), వైష్ణవి (7)లను విషమిచ్చి కోటేశ్వర రావు అనే వ్యక్తి చంపినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కోటేశ్వర రావు లేఖ రాసి పెట్టినట్లు వారు తెలిపారు. వారిని చంపిన తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కోటేశ్వర రావు ఆ లేఖలో చెప్పాడు.

మూడు రోజుల క్రితం హత్యా సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చిన శవాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే కోటేశ్వర రావు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. శ్రావణి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. కోటేశ్వర రావు వ్యాపారం చేస్తుండేవాడని అంటున్నారు.

English summary
In a ghastly incident occurred in Hyderabad, family head killed his wife and to children. Police said that the family head Koteswara rao is not traced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X