కడప ఉప ఎన్నిలు వైయస్కు, జగన్కు మధ్య పోరు: మల్లు భట్టి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మతతత్వాలకు దూరంగా ఉన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైయస్ రాముడైతే వివేకా లక్ష్మణుడు అని పొగిడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధిష్టానం తెలంగాణ ప్రకటన ఖచ్చితంగా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వాన్ని కూల్చాలనే జగన్ అనుకుంటున్నారని మరో నేత కమలాకరరావు అన్నారు. అహంకారంతోనే జగన్ కాంగ్రెసు పార్టీని వీడాడని అన్నారు. సోనియాను జగన్ విమర్శించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications