ఉప ఎన్నికల దృష్ట్యా కడప జిల్లాలో భారీ బందోబస్తు
బందోబస్తు నిమిత్తం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల పోలీసు బలగాలు కూడా వస్తున్నట్టు రాష్ట్ర పోలీసు డైరక్టర్ జనరల్ అరవిందరావు తెలిపారు. హైదరాబాద్లోని కేంద్ర బలగాలన్నీ అక్కడికి వెళ్తాయన్నారు. మొత్తం 10వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్తో కలసి డీజీపి బుధవారం కడపలోని ఎన్నికల, పోలీసు అధికారులతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు.
Comments
English summary
Director General of Police K. Aravinda Rao reviewed the security arrangements in Kadapa district, where the byelections are slated to take place, here on Wednesday.
Story first published: Thursday, May 5, 2011, 12:56 [IST]