కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగబాబు వచ్చినా చిరంజీవి లేవమంటారు: జగన్ వర్గం నేత రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వాళ్లకు స్వేచ్ఛ లేదని కాటసాని రామిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత రోజా ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. ప్రజారాజ్యం పార్టీలోనే స్వేచ్చ లేదనే విషయం అందరికీ తెలుసున్నారు. పార్టీ అఫీసుకు నాగబాబు వచ్చినా కూడా చిరంజీవి అందరినీ లేచి నిలబడమని చెబుతారని అలాంటిది చిరంజీవి దగ్గర స్వేచ్ఛ ఉందని చెప్పడం శోచనీయమన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా స్వేచ్ఛ ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.

కడప, పులివెందులలో జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెసు, టిడిపిలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయన్నారు. జగన్ రాజకీయంగా ఎదగకూడదని సోనియాగాంధీ కూడా కోరుకుంటున్నారన్నారు. ఎంత ఖర్చు పెట్టైన సరే జగన్ మెజార్టీ తగ్గించాలని వారు చూస్తున్నారన్నారు. చిరు మీసం తిప్పి, తొడ కొట్టడం వల్ల జగన్ మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. సామాజిక మార్పు పేరుతో కాంగ్రెసుపై విమర్శలు చేసి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చిరంజీవి ఇప్పుడు అదే కాంగ్రెసులో కలవడం నీతిమాలిన చర్య అన్నారు. రాష్ట్రానికి మంచి చేసిన వైయస్ కుటుంబం వైపే కడప ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలు జగన్ వైపు ఉన్నారని, కాబట్టి నాయకులు ఎటు వెళ్లినా సమస్య లేదన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp leader Roja blamed PRP president Chiranjeevi and TDP president Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X