కడపలో మళ్లీ జడలు విప్పిన ఫ్యాక్షన్: ఇద్దరు కాంగ్రెసు కార్యకర్తల హత్య

Congress
కడప: ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు కడప గడపలో మరోసారి ఫ్యాక్షన్ రాజ్యం జడలు విప్పింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం రెండు ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. అయితే గ్రామంలో ఆధిపత్య పోరు, భూవివాదం కారణంగా జరిగినట్లుగా తెలుస్తోంది. చెన్నమరాజుపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, సుబ్బారాయుడు ఇద్దరు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఈ ఘటనలో మృతి చెందారు. భూవివాదాలు, ఆధిపత్య పోరు కారణంగా శుక్రవారం ఉదయం లక్ష్మీనారాయణను ప్రత్యర్థులు ట్రాక్టరుతో గుద్ది చంపారు.

లక్ష్మీనారాయణకు దగ్గర బంధువుగా భావించబడుతున్న సుబ్బారాయుడును కత్తులతో నరికారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న సుబ్బారాయుడును ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. వీరిని ప్రత్యర్థులు అయిన నడికొండ వర్గం హత్య చేసి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. నడికొండ వర్గానికి, చనిపోయిన వారికి గత కొన్నాళ్లుగా ఆధిపత్యపోరు, భూవివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. 1999లో కూడా ఓ హత్య కేసులో మృతులు నిందితులని సమాచారం. 2003లో వీరు ఆ కేసు నుండి బయట పడ్డారు. అయితే ఒక రోజు పోతే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హత్యలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+