ఉప పోరు తెచ్చిన సమస్య: వైయస్ జగన్ వర్గంలో అసంతృప్తులు!

పార్టీ ఎన్నికల కమిటీలో ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహనరెడ్డి ఉన్నారు. కడప లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్ల విషయానికి వస్తే కడప కార్పొరేషన్ స్థాయిలో డివిజన్ పర్యవేక్షకులుగా ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, బాబూరావు, ఆళ్ల నాని తదితరులను నియమించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా తమ సొంత మనుషులు వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.
మైదుకూరు శాసనసభా నియోజకవర్గం బాధ్యతలను శోభా నాగిరెడ్డికి అప్పగించారు. ప్రొద్దుటూరుమాజీ మంత్రి కొండా సురేఖకు అప్పగించారు. బద్వేల్లో కీలక బాధ్యతల్లో ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎమ్మెల్యేలు శివ ప్రసాద్రెడ్డి, రామకృష్ణారెడ్డిలను నియమించారు.
అయితే వీరంతా స్థానికేతరులే. దీంతో స్థానికంగా ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరంతా వైఎస్ఆర్ జిల్లా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. వీరు వెళ్లిపోయాక స్థానిక నేతలు ఏంచేయాలో వారికి సరైన దిశానిర్దేశం ఎవరు చేయాలో తెలియని పరిస్థితి మా పార్టీలో కన్పిస్తోంది అని జగన్ పార్టీ నేత ఒకరు అన్నారు. సొంత జిల్లాలో అందులోనూ సొంత నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఇతర ప్రాంతాల నుంచి నేతలను వలసలు తెచ్చుకోవడం ఏమిటని ఆ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications