కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎల్ బెదిరింపులకు పాల్పడుతున్నారు: కలెక్టర్‌కు జగన్ ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తనకు ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నారని ఓటేయక పోతే పెట్రోలు పోసి తగల బెడతానని బెదిరిస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ శశిభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం తుడిమెలదిన్నె గ్రామంలో మంత్రి డిఎల్ అనుచరులు బెదిరించారని జగన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను బెదిరింపులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా అంతకుముందు రెండు రోజుల క్రితం మంత్రి డిఎల్ అనుచరులుగా భావిస్తున్న వారి దాడిలో గాయపడ్డ తుడిమెలదిన్నె బాధితుల్ని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇటువంటి చర్యలకు ప్రోత్సహించటం సిగ్గుచేటు అన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy was complained to collector Sashi Bushan against minister DL Ravindra Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X